||సుందరకాండ ||

||ముప్పది మూడవ సర్గ తెలుగు తాత్పర్యముతో||

|| Sarga 33 || with Slokas and meanings in Telugu


|| Om tat sat ||

సుందరకాండ.
అథ త్రయస్త్రింశస్సర్గః

సోఽవతీర్య ద్రుమా త్తస్మా ద్విద్రుమప్రతిమాననః|
వినీతవేషః కృపణః ప్రణిప త్యోపసృత్య చ||1||
తా మబ్రవీన్మహాతేజా హనుమాన్ మారుతాత్మజః|
శిర స్యంజలిమాధాయ సీతాం మధురయా గిరా||2||

స||సః వినీత వేషః విద్రుమప్రతిమాననః తస్మాత్ ద్రుమాత్ అవతీర్య కృపణః ప్రణిపత్య ఉపసృత్య చ|| మహాతేజా మారుతాత్మజః హనుమాన్ శిరస్యంజలిమాధాయ మధురయా గిరా తాం సీతాం అబ్రవీత్||

వినయవిధేతలు గలవాని వలే వస్త్రములు ధరించినవాడు , పగడముల్తో సమానమైన కాంతి గలవాడు మారుతాత్మజుడు ఆ వృక్షమునుంచి దిగి సమీపించి నమస్కరించెను. ఆ హనుమంతుడు శిరస్సుతో అంజలి ఘటించి మధురమైన మాటలతో అ సీతతో మాట్లాడెను.

కాను పద్మ పలాశాక్షి క్లిష్టకౌశేయవాసిని|
ద్రుమస్య శాఖామాలంబ్య తిష్ఠసి త్వమనిందితే||3||
కిమర్థం తవ నేత్రాభ్యాం వారిస్రవతి శోకజం|
పుండరీకపలాశాభ్యాం విప్రకీర్ణ మివోదకమ్||4||

స|| పద్మపలాశాక్షి క్లిష్టకౌశేయవాసిని అనిందితే ద్రుమస్య శాఖాం ఆలంబ్య తిష్టసి | కా ను?||తవ నేత్రాభ్యాం కిమర్థం వారిః పుండరీకపలాశాభ్యాం విప్రకీర్ణ ఉదకం ఇవ స్రవతి ||

పద్మరేకులవంటి కళ్ళు కలదానా, నలిగిన పట్టువస్త్రములు ధరించినదానా, దోషములు లేని దానా చెట్టుకొమ్మని పట్టుకొని నిలబడిన దానా, నీవు ఎవరివి? తామరాకులనుంచి నీరు జారినట్లు నీ నేత్రములనుంచి ఎందుకు కనీళ్ళు జారుతున్నాయి?

సురాణాం అసురాణాం వా నాగగంధర్వ రక్షసామ్|
యక్షాణాం కిన్నరాణాం వా కా త్వం భవసి శోభనే||5||
కా త్వం భవసి రుద్రాణాం మరుతాం వా వరాననే|
వసూనాం వా వరారోహే దేవతా ప్రతిభాసిమే||6||

స|| శోభనే సురాణాం వా అసురాణాం వా నాగ గంధర్వ రక్షసామ్ యక్షాణాం వా కిన్నరాణాం వ కా త్వం|| రుద్రాణాం వా మరుతానాంవసూనాం వా కా త్వం| మే వరాననే వరారోహే (త్వం) దేవతా ప్రతిభాసి |

ఓ మంగళరూపిణీ సురలలో గాని అసురలలోగాని నాగులు గంధర్వులు రాక్షసులు లేక కిన్నరులగాని వీరిలో నీవు ఎవరివి? రుద్రగణములకు కాని మరుత్ గణములకు కాని వసువులకుగాని చెందిన దానవా ? ఓ వరాననా అందమైన అవయవములు కలదానా నీవు తప్పక దేవతలవలే శోభిస్తున్నావు.

కిన్ను చంద్రమసా హీనా పతితా విబుధాలయాత్|
రోహిణీ జ్యోతిషాం శ్రేష్ఠా శ్రేష్ఠసర్వగుణాన్వితా||7||
కా త్వం భవసి కల్యాణీ త్వ మనిందితలోచనే|
కోపాద్వా యది మోహాత్ భర్తారమసితేక్షణా||8||
వసిష్టం కోపయిత్వా త్వం నాసి కల్యాణ్యరుంధతీ|

స|| చంద్రమసా హీనా విబుధాలయాత్ పతితా జ్యోతిషాం శ్రేష్ఠా శ్రేష్ఠసర్వగుణాన్వితా రోహిణీ కిం ను?|| కల్యాణీ అనిందితలోచనే కా త్వం భవసి | కోపాత్ వా మోహాత్ వా భర్తారం వశిష్ఠం కోపయిత్వా కల్యాణీ అరుంధతీ న అసి |

చంద్రుని వదలి ఆకాశమునుంచి పడిన నక్షత్రములలో శ్రేష్ఠమైన , శ్రేష్ఠమైన గుణములు కల రోహిణివా నువ్వు? ఓ కల్యాణీ దోషములేని నేత్రములు కలదానా ఎవరివి నీవు? కోపముతోకాని మోహముతో కాని భర్త అయిన వశిష్ఠుని వదిలి వచ్చిన అరుంధతివా ?

కోనుపుత్రః పితా భ్రాతా భర్తా వా తే సుమధ్యమా||9||
అస్మాల్లోకాదముం లోకం గతం త్వం అనుశోచసి|
రోదనా దతినిశ్శ్వాసాత్ భూమిసంస్పర్శనా దపి||10||
న త్వాం దేవీ మహం మన్యే రాజ్ఞ స్సంజ్ఞావధారణాత్|
వ్యంజనాని చ తే యాని లక్షణాని చ లక్షయే||11||
మహిషీ భూమిపాలస్య రాజకన్యాఽసి మే మతా|

స|| సుమధ్యమే తే పుత్రః పితా భ్రాతా భర్తా వా కో ను| అస్మాత్ లోకాత్ అముం లోకం గతా అనుశోచసి || రోదనాత్ అతినిఃశ్వాసాత్ భూమి సంస్పర్శనాత్ అపి రాజ్ఞః సంజ్ఞావధారణాత్ త్వాం దేవీం న సంజ్ఞే|| తే యాని వ్యంజనాని లక్షణాని చ లక్షయే భూమిపాలస్య మహిషీ రాజకన్యాసి చ మే మతా||

ఓ సుమధ్యమా ! నీ పుత్రులు, తండ్రి భర్త, సోదరులు ఎవరు ఈ లోకమునుంచి పరలోకమునకు పోవుటవలన నువ్వు దుఃఖములో ఉన్నావు. నీ రోదనములో ని ఉఛ్వాస నిఃశ్వాసములతో భూమి మీద నిలబడడములో రాజలక్షణములతో నీవు దేవతవు కావు అని అనుకుంటున్నాను. నీ మీదయున్న లక్షణములతో నువ్వు రాజ మహిషి అగు రాజ కన్యవు అని భావిసున్నాను.

రావణేన జనస్థానాత్ బలాదపహృతా యది||12||
సీతా త్వమసి భద్రం తే తన్మమాచక్ష్య పృచ్ఛతః|
యథా హి తవ వై దైన్యం రూపం చాప్యతిమానుషమ్||13||
తపసా చాన్వితో వేషః త్వం రామమహిషీ ధ్రువమ్|

స|| త్వం జనస్థానాత్ రావణేన బలాత్ అపహృతా సీతా అసి యది తత్ పృచ్ఛతః మమ ఆచక్ష్వ | తే భద్రం అస్తు||తవ దైన్యం అతిమానుషం రూపం వ తపసా అన్వితః వేషః యథా త్వం ధ్రువం రామ మహిషీ||

నీవు జనస్థానమునుండి రావణుని చేత బలాత్కారముగా అపహరింపబడిన సీత అయినచో అది నాకు చెప్పుము. నీకు శుభము అగు గాక. నీ లోని దైన్యము, అతిమానుషరూపము, తపస్విని వేషము చూచి నువ్వు తప్పక రామ మహిషి వే !

సా తస్య వచనం శ్రుత్వా రామకీర్తన హర్షితా||14||
ఉవాచ వాక్యం వైదేహీ హనుమంతం ద్రుమాశ్రితమ్|
పృథివ్యాం రాజసింహానాం ముఖ్యస్య విదితాత్మనః||15||
స్నుషా దశరథస్యాహం శత్రుసైన్యప్రతాపినః|
దుహితా జనకస్యాహం వైదేహస్య మహాత్మనః||16||
సీతేతి నామ నామ్నాsహం భార్యా రామస్య ధీమతః|

స|| సా వైదేహీ తస్య వచనం శ్రుత్వా రామకీర్తన హర్షితా ద్రుమాశ్రితం హనుమంతం వాక్యం ఉవాచ||అహం పృథివ్యాం రాజసింహానాం ముఖ్యస్య విదితాత్మనః శత్రుసైన్య ప్రతాపినః దశరథస్య స్నుషా || అహం మహాత్మనః వైదేహస్య జనకస్య దుహితా | ధీమతః రామస్య భార్యా సీత ఇతి నామ నామ్నా||

ఆ వైదేహి అతని వచనములను విని రామకీర్తనతో హర్షితురాలై ఆ వృక్షమునాశ్రయించిన హనుమంతునితో ఇట్లు పలికెను. నేను భూమండలములో రాజసింహులలో ముఖ్యులైన , ఆత్మను ఎరిగిన, శత్రు సైన్యములను రూపుమాపిన, దశరథుని కోడలిని. నేను మహాత్ముడైన విదేహమహరాజు అగు జనకుని పుత్రికను. ధీమంతుడైన రాముని భార్యను. సీత అని పేరుగలదానిని.

సమా ద్వాదశ తత్రాహం రాఘవస్య నివేశనే||17||
భుంజానా మానుషాన్ భోగాన్ సర్వకామసమృద్ధినీ|
తత్ర త్రయోదశే వర్షే రాజ్యే నేక్ష్వాకునందనమ్||18||
అభిషేచయితుం రాజా సోపాధ్యాయః ప్రచక్రమే|

స|| అహం తత్ర రాఘవస్య నివేసనే మానుషాన్ భోగాన్ భుంజానా సర్వకామసమృద్ధినీ ద్వాదశ సమాః|| తత్ర త్రయోదసే వర్షే సోపాధ్యాయః రాజా ఇక్ష్వాకుకులనందనం రాజ్యేన అభిషిక్తుం ప్రచక్రమే||

నేను ఆ రాఘవుని నివాసములో మానుష భోగములను అనుభవిస్తూ అన్ని సదుపాయములతో పన్నెండు సంవత్సరములు గడిపితిని. అప్పుడు పదమూడవ సంవత్సరములో రాజ గురువులతో కలిసి ఆ మహారాజు ఇక్ష్వాకు నందనుడగు రాముని పట్టభిషేకమునకు నిర్ణయించెను.

తస్మిన్ సంభ్రియమాణే తు రాఘవస్యాభిషేచనే||19||
కైకేయీ నామ భర్తారం దేవీ వచనమబ్రవీత్|
న పిబేయం న ఖాదేయం ప్రత్యహం మమ భోజనమ్||20||
ఏష మే జీవితస్యాంతో రామో యద్యభిషిచ్యతే|
యత్త దుక్తం త్వాయా వాక్యం ప్రీత్యా నృపతి సత్తమ||21||
తచ్ఛేన్న వితథం కార్యం వనం గచ్ఛతు రాఘవః|

స|| తస్మిన్ రాఘవస్య అభిషేచనే సంభ్రియమాణే కైకేయి నామ దేవీ భర్తారం వచనం అబ్రవీత్|| న పిబేయం ప్రత్యహం భోజనం న ఖాదేయం (యది) రామః అభిషిచ్యతే | ఏషః మే జివితం అంతః|| నృపసత్తమ త్వయా ప్రీత్యా యత్ తత్ వాక్యం ఉక్తామ్ తత్ వితథం న కార్యం యది రాఘవః వనమ్ గచ్ఛతు||

ఆ రాఘవుని పట్టాభిషేకమునకు జరుగుతున్న సంభ్రమములతో కైకేయి అనబడు దేవి భర్తతో ( దశరథునితో) ఇట్లు పలికెను. " రాముని అభిషేకముతో నేను ఎమీ తాగను , ప్రతిరోజూ భోజనము చేయను. ఇది నా జీవితమునకు అంతము. ఓ నృపసత్తమా నీవు ప్రేమతో ఏ మాటలు చెప్పితివో ఆవి వృధాకాకుండా వుండాలి అంటే రాఘవుడు వనము నకు పోవును".

స రాజా సత్యవాగ్దేవ్యా వరదానమనుస్మరన్||22||
ముమోహ వచనం శ్రుత్వా కైకేయ్యాః క్రూరమప్రియమ్|
తతస్థు స్థవిరో రాజా సత్యే ధర్మే వ్యవస్థితః||23||
జ్యేష్ఠం యశస్వినం పుత్త్రం రుదన్ రాజ్య మయాచత|
స పితుర్వచనం శ్రీమాన్ అభిషేకాత్పరం ప్రియమ్||24||
మనసా పూర్వ మాసాద్య వాచా ప్రతిగృహీతవాన్|

స|| సత్యవాక్ స రాజా దేవ్యాః వరదానం అనుస్మరన్ కైకేయ్యాః అప్రియం వచనం శ్రుత్వా ముమోహ|| తతః సత్యే ధర్మే వ్యవస్థితః స్థవీరః రాజా రుదన్ జ్యేష్ఠం పుత్రం రాజ్యం అయాచత| సః శ్రీమాన్ పితుః వచనం అభిషేకాత్ పరం ప్రియం మనసా పూర్వం ఆసాద్య వాచా ప్రతిగృహీతవాన్ ||

సత్యవంతుడైనా ఆ రాజు ఆ దేవికి ఇచ్చిన వరదానమును స్మరించి, కైకేయి యొక్క అప్రియమైన మాటలు విని మూర్ఛపోయెను. అప్పుడు సత్య ధర్మములో అనుష్ఠితుడైన ఆ రాజు విలపించుచూ జ్యేష్ఠపుత్రుని రాజ్యము గురించి కోరెను. ఆ శ్రీమంతుడు అభిషేకము కన్న పిత్రువచన పరిపాలన ముఖ్యమని మనసా తలిచి తన వాక్కుతో అంగీకరించెను.

దద్యాన్నప్రతిగృహ్ణీయాన్ నబ్రూయాత్ కించిదప్రియమ్||25||
అ పి జీవితహేతోర్వా రామః సత్యపరాక్రమః|
స విహా యోత్తరీయాణి మహార్హాణి మహాయశాః||26||
విసృజ్య మనసా రాజ్యం జనన్యై మాం సమాదిశత్|
సాహం తస్యాగ్రతస్తూర్ణం ప్రస్థితా వనచారిణీ||27||
న హి మే తేన హీనయా వాసః స్వర్గేనపి రోచతే|
ప్రాగేన తు మహాభాగః సౌమిత్రిః మిత్రనందనః||28||
పూర్వజ స్యానుయాత్రార్థే ద్రుమచీరై రలంకృతః|

స||సత్యపరాక్రమః రామః దద్యాత్ నప్రతిగృహ్ణియాన్ జీవితహేతోర్వా కించియ్ అప్రియమ్ నబ్రూయాత్ ||మహాయశాః సః మహార్హాణి ఉత్తరీయాణి విహాయ మనసా రాజ్యం విశ్రుజ్య మామ్ జనన్యై సమాదిశత్||అహం తస్య అగ్రతః వనచారినీ తూర్ణం ప్రస్థితా | తేన హీనాయాః మే స్వర్గోపి న రోచతే ||మహాభాగః మిత్రనందనం సౌమిత్రి పూర్వజస్య అనుయాత్రార్థే ద్రుమచీరై రలంకృతః||

సత్యమే పరాక్రమముగా గల ఆ రాముడు ఎప్పుడూ ఇచ్చెడి వాడు మరల తీసుకొనువాడు కాదు. ప్రాణసంకటములో కూడా అప్రియమైన మాటలు చెప్పువాడు కాడు. మహాయశోవంతుడైన అతడు మహత్తరమైన ఉత్తరీయములను వదిలి మనసా రాజ్యము వదిలి నన్ను తన జననికి అప్పగించెను. నేను ఆయనికి ముందే వనచారిణి గా సిద్ధము అయితిని. ఆయన లేకుండా నాకు స్వర్గము కూడా ఇష్ఠము లేదు. మహాభాగుడు మిత్రనంద నుడు అగు సౌమిత్రి కూడా పూర్వజుని అనుసరించుటకు నారచీరలతో అలంకరించుకొనెను.

తే వయం భర్తురాదేశం బహుమాన్య దృఢవ్రతాః||29||
ప్రవిష్టాః స్మ పురా దృష్టం వనం గంభీరదర్శనమ్|
వసతో దండకారణ్యే తస్యాహ మమితౌజసః||30||
రక్షసా పహృతా భార్యా రావణేన దురాత్మనా|
ద్వౌమాసౌ తేన మే కాలో జీవితానుగ్రహః కృతః||31||
ఊర్ధ్వం ద్వాభ్యాం తు మాసాభ్యాం తతస్తక్ష్యామి జీవితమ్||32||

స|| తే వయం భర్తుః ఆదేశం బహుమాన్య దృఢవ్రతాః పురా అదృష్టం గంభీరదర్శనం వనం ప్రవిష్టాః స్మ||అమితతేజసః తస్యాం భార్యా అహం దండకారణ్యే వసతః | దురాత్మనా రక్షసా రావణేన అపహృతా||తేన ద్వౌమాసౌ కాలో జీవితానుగ్రహః కృతః| తతః ద్వాభ్యాం మాసాభ్యాం ఊర్ధ్వం జివితం తక్ష్యామి||

మేము అందరము రాజ ఆదేశమును శిరసావహించి ధృడమైన వ్రతముతో ఎప్పుడూ చూడబడని గంభీరమైన అ వనమును ప్రవేశించితిమి. అమితతేజస్సు కల ఆయన భార్యను అయిన నేను దండకారణ్యములో నివశించుచుండిని. దురాత్ముడైన రాక్షసుడు రావణుని చేత అపహరించబడితిని. వానిచేత రెండు నెలల కాలము జీవితము గడువు పెట్టబడెను. ఆ రెండు నెలల తరువాత జీవితమి త్యజించెదను.

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే వాల్మీకీయే
చతుర్వింశత్ సహస్రికాయాం సంహితాయామ్
శ్రీమత్సుందరకాండే త్రయస్త్రింశస్సర్గః||

ఈవిధముగా శ్రీమద్వాల్మీకి రామాయణములో సుందరకాండలో ముప్పది మూడవ సర్గ సమాప్తము.

|| ఓమ్ తత్ సత్||